వైసీపీ ఎమ్మెల్యేలకు టీడీపీ అధినేత చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇచ్చారు.వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు టీడీపీలోకి రావాలని పిలుపునిచ్చారు.
మంచి వాళ్లయిన వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తామంటే తీసుకుంటామని చెప్పారు.ప్రజలకు సేవ చేయాలనుకునే వారిని పార్టీలోకి తీసుకుంటే తప్పులేదని తెలిపారు.
వైసీపీలో ప్రస్తుతం అంతర్యుద్ధం జరుగుతోందన్న ఆయన రాష్ట్రం మీద గౌరవం ఉన్న వారెవ్వరు ఆ పార్టీలో ఉండరని వెల్లడించారు.వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు.
తన సభలకు ఇప్పుడు వస్తున్న జనం ప్రారంభం మాత్రమేనన్నారు.భవిష్యత్ లో జనం సునామీలా వస్తారని పేర్కొన్నారు.
ప్రభుత్వ వేధింపులకు కొందరు ఇంకా బయటకు రావడం లేదని వెల్లడించారు.