టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి, మాస్ రాజా రవితేజ కలిసి నటించిన మల్టీ స్టారర్ సినిమా ‘వాల్తేరు వీరయ్య’.ఇక ఈ సినిమాతో మెగాస్టార్ చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు.
సరైన మాస్ సినిమా సరైన సమయంలో రిలీజ్ చేస్తే ఇప్పటికి మెగాస్టార్ స్టామినా ఎంత మాత్రం తగ్గలేదు అని నిరూపిస్తున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే మెగా ఫ్యాన్స్ కు పండుగ అనే చెప్పాలి.ఈ శుక్రవారం జనవరి 13న సంక్రాంతి కానుకగా చిరు తన కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.”వాల్తేరు వీరయ్య” సినిమా మెగా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది అనే చెప్పాలి.బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియెన్స్ ను సైతం మెప్పించింది.శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.
పూర్తి స్థాయిలో పాజిటివ్ రాకపోయినా ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర రోజురోజుకూ కలెక్షన్స్ పెంచుకుంటూ పోతుంది.మొత్తానికి మెగాస్టార్ ఖాతాలో మరోసారి 100 కోట్ల సినిమా చేరిపోయింది.మెగాస్టార్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ దిశగా ఈ సినిమా దూసుకు పోతుంది.ఇక్కడే కాదు వీరయ్య యూఎస్ లో కూడా కుమ్మేస్తున్నాడు.
యూఎస్ లో మాసివ్ వసూళ్లు నమోదు చేస్తూ రికార్డులను బ్రేక్ చేస్తుంది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వాల్తేరు వీరయ్య సినిమా నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డ్ ను సెట్ చేసిందట.ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి ఆదివారం అత్యధిక వసూళ్లు నమోదు చేసిన టాలీవుడ్ చిత్రంగా రికార్డ్ సెట్ చేసింది.టాప్ లో ఆర్ఆర్ఆర్ ఉండగా ఆ తర్వాత 3 లక్షల 55 వేల డాలర్స్ తో వీరయ్య సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు.
మొత్తానికి బాస్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ గా ఈ సినిమా నిలిచింది.