ఏపీలోని జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 1 నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుక రూ.3 వేలకు పెంపు అమల్లోకి వస్తుందని తెలిపారు.
జనవరి ఒకటో తేదీ నుంచి 8 వరకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్న సీఎం జగన్ 3వ తేదీన పెన్షన్ల పెంపు కార్యక్రమంలో పాల్గొంటానని పేర్కొన్నారు.
ప్రజలు ఇబ్బందులు పడకూడదనే వాలంటీర్ – సచివాలయ వ్యవస్థను గ్రామస్థాయిలోకి తీసుకొచ్చామన్నారు.అలాగే జనవరి 19న విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు.జనవరి 23 నుంచి 31 వరకు ఆసరా కార్యక్రమం, ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీఎం జగన్ తెలిపారు.తరువాత ఫిబ్రవరి 15, 16 తేదీల్లో ఉత్తమ వాలంటీర్లకు అవార్డులను అందజేయనున్నట్లు వెల్లడించారు.







