మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీబీఐ కోర్టులో విచారణ జరిగింది.
కేసు విచారణలో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని మార్చినట్లు పీపీ సీబీఐ కోర్టుకు తెలిపారు.ఈ మేరకు త్వరలోనే ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని సీబీఐ స్పెషల్ పీపీ న్యాయస్థానానికి వెల్లడించారు.
మరోవైపు సీబీఐ స్పెషల్ పీపీకి సాయం చేసేందుకు తాము సిద్ధమని మృతుని కుమార్తె సునీతా రెడ్డి అఫిడవిట్ లో పేర్కొన్నారు.ఇందులో భాగంగా తమ వాదనలు కూడా వినాలని ఆమె ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు.
అనంతరం సీబీఐ కోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 28వ తేదీకి వాయిదా వేసింది.