పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా ఈ నెల 25న రిలీజ్ ఫిక్స్ చేశారు.మళయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుం కోషియం రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ లు కలిసి నటించారు.
సాగర్ చంద్ర డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు త్రివిక్రం.అయితే ముందు ఈ సినిమా రీమేక్ చేయాలని ఆలోచన వచ్చినప్పుడు యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ చర్చల్లో ఉన్నాడట.
అతన్నే డైరక్టర్ గా తీసుకోవాలని అనుకున్నారట.
కానీ అతను నానితో అంటే సుందరానికీ సినిమా కమిట్ అవడంతో భీమ్లా నాయక్ సినిమా ఛాన్స్ వదులుకున్నాడు.
మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాలతో మెప్పించిన వివేక్ ఆత్రేయ అంటే సుందరానికీతో కూడా ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నాడు.వివేక్ కుదరదని చెప్పడంతో అప్పట్లో ఒకడుండేవాడుతో ప్రతిభ చాటిన సాగర్ చంద్రకి పిలిచి మరి భీమ్లా నాయక్ సినిమా ఛాన్స్ ఇచ్చారు.
తనకు వచ్చిన అవకాశాన్ని సాగర్ చంద్ర బాగానే వాడుకున్నాడని అనిపిస్తుంది.ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచేలా ఉంది.