ఆగిపోయిన విశాల్ పెళ్లి.. వేరొక వ్యక్తితో అనీషా

ఈ ఏడాది కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తాను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి పీటలు ఎక్కాలని అనుకున్నాడు.దాని కోసం నిశ్చితార్ధం కూడా చేసుకున్నాడు.

అయితే కరోనా కాలంలో పెళ్లి సింపుల్ గా చేసుకోవడం ఇష్టం లేక వాయిదా వేసేశాడు.అయితే ఇప్పుడు విశాల్ పెళ్లి గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విశాల్ పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని టాక్ గట్టిగా వినిపిస్తుంది.విశాల్ నిశ్చితార్ధం అయిన తర్వాత పెళ్లి గురించి ఎప్పుడూ, ఎక్కడా మాట్లాడలేదు.

కనీసం దానికి సంబందించిన ఆలోచన కూడా లేనట్లు తన సినిమాలు తాను చేసుకుంటూ వెళ్తున్నాడు.ఈ నేపధ్యంలో ఇప్పుడు విశాల్ పెళ్లి క్యాన్సిల్ అయ్యిందనే ప్రచారం తెరపైకి వచ్చింది.

Advertisement

గతంలో ఈ టాక్ వినిపించిన అప్పుడు విశాల్ తండ్రి ఈ రూమర్ ని కొట్టిపారేశారు.లాక్ డౌన్ వెళ్లిన తర్వాత వివాహ వేడుక జరుగుతుందని తెలిపారు.

అయితే ఈ ఏడాదికి పెళ్లి ముహూర్తాలు అన్ని వెళ్లిపోయాయి.అయినా కూడా వీరి పెళ్ళికి సంబంధించి ఊసే లేదు.

ఈ నేపధ్యంలో విశాల్, అనిషా పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని, ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుందనే టాక్ వచ్చింది. అనీషా రెడ్డికి ఓ యువ పారిశ్రామిక వేత్తతో రీసెంట్ గా నిశ్చితార్ధం అయ్యిందని, ఇక త్వరలో పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం ఫిక్స్ చేస్తున్నారని వార్త గట్టిగా వినిపిస్తుంది.

ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్లు కోలీవుడ్ లో గట్టిగా వినిపిస్తుంది.మరి ఈ వార్తలలో నిజమెంత అనేది తెలియాలంటే విశాల్ స్పందించే వరకు వేచి చూడాలి.

వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

Advertisement

తాజా వార్తలు