షర్మిలను దూరం పెట్టారా ? దూరమైందా? ఫోటో చెబుతున్న స్టోరీ!

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో వైసీపీ మునుపెన్నడూ లేని విధంగా వేడుకలు జరుపుకుంది. విజయవాడలో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో రక్తదాన శిబిరాలు జరిగాయి.

 Viral Pic Jagan Family Without Sharmila Telangana, Chief Minister, Y.s. Sharmila-TeluguStop.com

ఎన్నడు లేని విధంగా  వైసీపీ ఆధ్వర్యంలో జగన్ జన్మదిన వేడుకల్లో ఘనంగా జరిగాయి.

 తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్‌కు మంత్రివర్గ సహచరులు ఘనస్వాగతం పలికారు.

 అంతకు ముందు జగన్ తల్లి వైఎస్ విజయమ్మ హైదరాబాద్ నుంచి తాడేపల్లికి వచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఎపి సిఎం అధికారిక హ్యాండిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలో, విజయమ్మ జగన్,  అతని భార్య భారతి, టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఇతరులు ఉన్నారు.

జగన్ సోదరి, వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల కూడా జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతారని చాలా మంది ఆశించారు కానీ అది జరగలేదు. సోషల్ మీడియాలో కూడా షర్మిల తన సోదరుడికి శుభాకాంక్షలు తెలపలేదు.

 గతంలో లాగానే రక్షా బంధన్ సందర్భంగా షర్మిల  జగన్‌కు శుభాకాంక్షలు తెలుపుతారని వైఎస్ఆర్ అభిమానులు ఆశించారు.
 

కానీ సోదరుడికి దూరంగా ఉన్నారు.రెండేళ్లుగా జగన్, షర్మిల మధ్య మాటలు లేవు. విభేదాల కారణంగా షర్మిల ఏపీని వదిలి తెలంగాణలో అడుగుపెట్టి రాజకీయ పార్టీ పెట్టింది.

ఎంత అన్యోన్యంగా ఉన్న వీరిద్దరూ ఇలా ఎడ ముఖం పెడ ముఖంగా ఎందుకు ఉన్నారనేది చాలా మందికి  అర్ధం కావడం లేదు.కనీసం పరోక్షంగానైన ఇద్దరూ తమ అనుభందాన్ని గుర్తుచేసుకోలేనంత విభేదాలు వారి మధ్య ఏమి వచ్చాయనేది అర్ధం కానీ విషయం.

తాజాగా తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన షర్మిల జగన్ విషయంలో ఎందుకు స్పందించలేదని ఆశ్ఛర్యంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube