ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్( Smart phone ) తప్పనిసరి అయిపోయింది.దాంతో చాలామంది సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని రకరకాల పనులు చేస్తున్నారు.
ఇందులో కొన్ని వీడియోలు వైరల్ అవుతుంటే, మరి కొన్ని వీడియోలు సర్వర్ సంద్రంలో కొట్టుకు పోతుంటాయి.ఈ క్రమంలో తాజాగా ఓ నెటిజన్ చేసిన ప్రయత్నం ఫలించింది.
అంటే వైరల్ అయింది.నేలపై వేయాల్సిన ముగ్గును ఆమె అట్ల పెనంపై వేసి నెటిజన్ల ఆదరణను, కాదుకాదు ఆగ్రహానికి గురైంది.
అయితే వీడియోలోని వారి చేయి తప్ప ముఖం కనిపంచలేదు.
ఈ క్రమంలో నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.ఆ వీడియోలో ఓ చేయి అట్లు వేసే పిండితో అట్ల పెనంపై చుక్కలు పెట్టడం మనం గమనించవచ్చు.అ తర్వాత వాటిని ముగ్గుగా మార్చడాన్ని కూడా చూడవచ్చు.
అంతేకాకుండా ఓ దేశ వేసినపుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో ఇక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకోవడం చూడవచ్చు.ముగ్గు వేయడం పూర్తయ్యాక దానిపై నూనె వేసి( oil ), దాన్ని తినడానికి తీయడం కూడా వీడియోలో కనిపిస్తుంది మనకు.
కాగా, ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు.ఈ క్రమంలోనే కొందరు దీనిని ముగ్గుల దోశ అని పిలుస్తుంటే కొందరు కలర్స్ వేయడం మర్చిపోయారని, గొబ్బెమ్మ కూడా పెడితే బాగుండేదని కామెంట్స్ చేస్తున్నారు.మరి కొందరైతే చాలా తీవ్రంగా ‘ఇది ముగ్గుల దోశ కాదు.చేతబడి చేసుందుకు వేసిన దోశ.నిమ్మకాయలు కూడా పెట్టాల్సింది’ అంటూ కామెంట్ చేయడం ఇక్కడ గమనించవచ్చు.