వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవద్దు అని పవన్ చేసిన వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి కౌంటర్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు.ఈ సమావేశంలో అధికార పార్టీ వైసీపీ పై పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో మండిపడ్డారు.

 Vijaysai Reddy Counter To Pawan Kalyan , Vijaysai Reddy , Modi , Pawan Kalyan ,-TeluguStop.com

వైసీపీ ప్రభుత్వం రైతులను మోసం చేసిన ప్రభుత్వం అని 2024 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం రాదు అని జోస్యం చెప్పారు.అంతమాత్రమే కాదు వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు అడిగే హక్కు లేదని కూడా స్పష్టం చేశారు.ఇటువంటి తరుణంలో పవన్ చేసిన వ్యాఖ్యలకు వైసిపి సీనియర్ నేత విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో పరోక్షంగా కౌంటర్లు వేశారు.

“2014లో మోదీని పీఎం కానివ్వనంటూ ముంబైలో సోనియా శపథం.మోదీ టీ అమ్ముకో అంటూ మరొకరు ఎగతాళి.2024లో జగన్ గారిని సీఎం కానివ్వబోమంటూ రాష్ట్రంలో కొన్ని పార్టీలు ఇలాంటి సవాళ్ళే చేస్తున్నారు.ప్రజాస్వామ్యంలో ఎవరిని ఎక్కడ ఉంచాలో నిర్ణయించేంది ప్రజలే.మధ్యలో ఈ శిఖండి ప్రకటనలేంటి బాబులూ?”.అంటూ ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి చెలరేగిపోయారు.మరోపక్క పవన్ వ్యాఖ్యలపై మరికొంతమంది వైసీపీ నేతలు చంద్రబాబు దర్శకత్వంలోనే పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తున్నారని.2024 ఎన్నికల్లో జనసేన పార్టీ కార్యకర్తలతో అభిమానులతో టిడిపి జెండాలు పవన్ మోయించడం గ్యారెంటీ అని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube