ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ ‘వారిసు‘ సినిమాతో నిన్న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.కోలీవుడ్ లో భారీ అంచనాలను నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా నిన్న జనవరి 11న తెలుగులో తప్ప మిగిలిన అన్ని చోట్ల గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.
ఇక ఈ క్రేజీ సినిమాను దిల్ రాజు భారీ స్థాయిలో శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నాడు.
ఇదిలా ఉండగా ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.తెలుగులో కూడా దిల్ రాజు ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నప్పటికీ ఆయన పాచికలు పారలేదు.
థియేటర్స్ సమస్య కారణంగా ఈ సినిమాను తెలుగులో వాయిదా వేస్తున్నట్టు దిల్ రాజు ప్రకటించాడు.ఇక తెలుగులో ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కాబోతుంది.ఇదిలా ఉండగా ఈ సినిమా నిన్న బాక్సాఫీస్ దగ్గర ఎంత వసూళ్లు రాబట్టింది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 137.9 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా 138 కోట్ల టార్గెట్ తో విజయ్ బరిలోకి దిగాడు.
ఈ సినిమా టాక్ ఎలా ఉన్న ఫస్ట్ డే మాత్రం సాలిడ్ కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తుంది.మొదటి రోజు ఈ సినిమా తమిళనాడులో 20.15 కోట్ల వరకు ఓపెనింగ్స్ రాబట్టినట్టు టాక్.తమిళ్ లోనే కాదు మిగతా రాష్ట్రాల్లో కూడా ఈసారి విజయ్ కు మంచి కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తుంది.వరల్డ్ వైడ్ గా ఈ సినిమా మొదటి రోజు 46.32 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ 23.60 కోట్ల షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకుందట.మరి ఈ సినిమా పండుగ రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో వేచి చూడాల్సిందే.