విజయ్ దేవరకొండ టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా గుర్తింపు పొందాడు.వరుస ప్లాప్స్ వచ్చినా ఈయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
ఇటీవలే లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయనకు ఈ సినిమా భారీ షాక్ ఇచ్చింది.ఈ సినిమా ఇచ్చిన షాక్ నుండి బయట పడి మెల్లగా తన లైనప్ ను సెట్ చేసుకుంటున్నాడు.
ప్రెజెంట్ విజయ్ చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది.శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి‘ సినిమా చేస్తున్నాడు విజయ్.
అయితే ఈ సినిమా ఎప్పుడో లైగర్ రిలీజ్ ముందు ఆగిపోయింది.ఇంత వరకు తిరిగి స్టార్ట్ కాలేదు.
సమంత హెల్త్ కారణంగా ఈ సినిమా ప్రెజెంట్ వాయిదా పడింది.దీంతో విజయ్ ఈ ఖాళీ సమయాన్ని తన తర్వాత సినిమాలను సెట్ చేసుకునేందుకు వాడుకుంటున్నాడు.
ఇప్పటికే విజయ్ ముగ్గురు డైరెక్టర్లను ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది.విజయ్ జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తో సినిమా చేసేందుకు రెడీ అయినట్టు టాక్ వచ్చింది.ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది.అలాగే గీత గోవిందం డైరెక్టర్ పరశురామ్ కూడా ఇటీవలే విజయ్ కు కథ చెప్పగా ఈయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
అలాగే కన్నడ డైరెక్టర్ నర్తన్ కూడా విజయ్ తో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ గా ఉన్నడంటూ వార్తలు వస్తున్నాయి.ఈ మూడు సినిమాల కంటే ముందే విజయ్ సుకుమార్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా ఉంది అని ప్రకటించిన విషయం తెలిసిందే.ప్రెజెంట్ సుకుమార్ పుష్ప 2 తో బిజీగా ఉన్న నేపథ్యంలో ఇప్పట్లో ఇది సాధ్యం అవ్వడం కష్టమే.దీంతో విజయ్ సుక్కు మీద ఆశలు వదులుకుని నెక్స్ట్ లైనప్ సెట్ చేసుకుంటున్నాడు అని తెలుస్తుంది.
మరి వీరి కాంబో ముందు ముందు అయినా ఉంటుందో.కాలక్రమేణా ఆగిపోతుందో చూడాలి.