కోల్కతాలోని( Kolkata ) రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లో( railway station ) ఒక మహిళ పొట్టి బట్టలు వేసుకొని పిచ్చి గంతులు వేసింది.ఆమె అలా డ్యాన్స్ చేయడం చూసి ప్యాసింజర్లు షాక్ అయ్యారు.
ఏదో ఘనకార్యం చేసినట్లు దీనికి సంబంధించిన వీడియో రికార్డ్ చేసి మరీ ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఆ వీడియో ఆన్లైన్లో తీవ్ర చర్చకు దారితీసింది.
స్టేషన్లోనే కాకుండా ఆమె ట్రైన్ ఎక్కి ప్రయాణీకుల మధ్య డ్యాన్స్ కూడా చేసింది.దీనిని నెటిజన్లు బాగా తప్పు పట్టారు.
బెడ్ రూమ్ లో వేసుకోవాల్సిన డ్రెస్సు వేసుకొని పబ్లిక్ లోకి రావడమే తప్పు అనుకుంటే, అసభ్యకర రీతిలో డ్యాన్స్ చేయడం మరింత తప్పు అని అన్నారు.
పబ్లిక్ ప్లేస్ల్లో మర్యాదగా ప్రవర్తించుకోవాలని, అలాంటి కార్యకలాపాలు మరింత సరైన ప్రదేశాల్లో చేయాలని కొందరు కోరారు.ఈ యువతి( young woman ) వీడియోపై ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన కొన్ని వ్యాఖ్యలు చాలా హార్స్ గా ఉన్నాయి.‘రైల్వే స్టేషన్ లేదా మెట్రో ట్రైన్లో డ్యాన్స్ చేయడం అవమానకరం, ఈ డ్యాన్స్ మరింత చెత్తగా ఉంది, వైరల్గా మారడం కోసం ఇలాంటి పిచ్చి చేష్టలు చేయాల్సిన అవసరం లేదు.’ అని ఇంటర్నెట్ యూజర్లు మండిపడ్డారు.మరికొందరు ఇది తనను బాగా అసౌకర్యానికి గురి చేసిందని కామెంట్ చేశారు.
ఢిల్లీ, బెంగళూరు, ముంబై వంటి ఇతర నగరాల్లో కూడా ఈ ట్రెండ్ ను చాలా మంది ఫాలో అవుతున్నారు.ఇక్కడ ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో డ్యాన్స్ చేసి వైరల్ సెన్సేషన్ గా మారుతున్నారు.ఈ చర్యలపై ప్రజల నుంచి విమర్శలు, ఫిర్యాదులు కూడా వస్తున్నాయి.వారిపై చర్యలు తీసుకోవాలని కూడా అధికారులను కోరుతున్నారు.అధికారులు కూడా బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి పని చేయొద్దని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.అయినా ఈ ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి.