తెలంగాణ ఎన్నికల బరిలో వివాద పార్టీల నుంచి చాలామంది ఆశావాహులు టికెట్ కోసం ప్రయత్నించారు.అయితే… అవకాశం రానివారు రెబెల్స్ గా బరిలో దిగుతున్నారు.మరికొందరు ఏ పార్టీ లోకి వెళ్లలేక స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు.ఇప్పడు ఆ విధంగానే తెలంగాణ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు హాస్యనటుడు వేణుమాధవ్ గురువారం ప్రకటించారు.
టిడిపి కార్యకర్తగా ఉన్నప్పటికీ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే స్వతంత్రంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.వేణుమాధవ్ స్వస్థలం కోదాడే.ఇక్కడే ఆయన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు.ఈ రోజు ఆయన తన నామినేషన్ వేయనున్నట్లు సమాచారం.అయితే వేణుమాధవ్ కు స్థానికంగా మంచి పరిచయాలే ఉన్నా… గెలుపు అవకాశాలు మాత్రం ఉండే అవకాశం కనిపించడంలేదు.