కర్ణన్ రీమేక్ పై ఆసక్తి చూపించని విక్టరీ వెంకటేష్

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ రీసెంట్ గా కర్ణన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ లాక్‌డౌన్‌ కి కొద్దిరోజుల ముందు రిలీజ్ అయింది.

మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ తమిళ్ మూవీ విశేషంగా ఆకట్టుకుంది.రియల్ లైఫ్ క్యారెక్టర్ బేస్ చేసుకొని ఈ మూవీ దర్శకుడు తెరకెక్కించాడు.

దీంతో ప్రతి ఒక్కరికి కర్ణన్ మూవీ బాగా కనెక్ట్ అయింది.ఇదిలా ఉంటే ఈ మూవీని తెలుగులో రీమేక్ చేయడానికి ఇప్పటికే నిర్మాత బెల్లంకొండ సురేష్ రైట్స్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ మూవీని తన కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్ తో రీమేక్ చేస్తారని తెలుస్తుంది.అయితే నిర్మాత సురేష్ బాబు ముందుగా కర్ణన్ కథని వెంకటేష్ వద్దకు తీసుకెళ్లారు.

Advertisement

ఈ సినిమా చూసిన వెంకటేష్ కథ తెలుగులో వర్కౌట్ కాదనే ఉద్దేశంతో వదిలేశాడు.ఇంచుమించు అలాంటి బ్యాక్ డ్రాప్ స్టోరీతోనే ప్రస్తుతం వెంకటేష్ నారప్ప మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో కర్ణన్ రీమేక్ పై విక్టరీ వెంకటేష్ అంతగా ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది.దీంతో బెల్లంకొండ సురేష్ లైన్ లోకి వచ్చి తన కొడుకు శ్రీనివాస్ కోసం ఈ మూవీ రీమేక్ రైట్స్ ని కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో ఛత్రపతి రీమేక్ పనిలో ఉన్నాడు.దీని తర్వాత కర్ణన్ రీమేక్ పై దృష్టి పెట్టె అవకాశం ఉందని తెలుస్తుంది.

మరి కొడుకుని కమర్షియల్ హీరోగా నిలబెట్టాలనే బెల్లంకొండ సురేష్ ప్రయత్నంకి కర్ణన్ మూవీ ఎంత వరకు హెల్ప్ అవుతుందో చూడాలి.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు