మరోసారి తెరపై సందడి చేయబోతున్న మామా అల్లుడు

ఈ మధ్య మల్టీ స్టారర్ సినిమాలు ఎక్కువగా టాలీవుడ్ లో తెరపైకి వస్తున్నాయి.

సీనియర్ హీరోలు అందరూ ఇతర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.

కమర్షియల్ హంగులు ఉన్న కొత్త కథలకి పచ్చజెండా ఊపుతూ కాంబినేషన్ కి ప్రాధాన్యత ఇస్తున్నారు.ఒకప్పుడు సోలోగా తామే హీరోగా ఉండాలని, క్రెడిట్ అంతా తమకే రావాలనే ఫీలింగ్ పెట్టుకోకుండా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు వారి ఆలోచనలు కూడా మార్చుకుంటున్నారు.

ఇక మల్టీ స్టారర్ కథలు చేసే హీరోల జాబితాలో నాగార్జున, వెంకటేష్ పేర్లు ముందు వరుసలో వినిపిస్తాయి.ఒకప్పటిలా హీరోయిన్స్ తో రొమాన్స్ అంటూ కూర్చోకుండా తమ వయస్సుకి తగ్గ పాత్రలని వీరు ఎంపిక చేసుకుంటున్నారు.

ఈ నేపధ్యంలో నిర్మాతలు, దర్శకులు కూడా మల్టీ స్టారర్ కథలు సిద్ధం చేసి ఈ హీరోలకి వినిపించి ఒప్పించగలుగుతున్నారు. విక్టరీ వెంకటేష్ తన మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి వెంకీ మామ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి హిట్ కొట్టాడు.

Advertisement

ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ సెట్ అయ్యేలా కనిపిస్తుంది.తాజాగా ఓ యంగ్ డైరెక్టర్ సురేష్ బాబు వద్ద మల్టీస్టారర్ కథ చెప్పాడని టాక్.

ఈ కథ వెంకటేష్ మరియు చైతూలకు బాగా సూట్ అవుతుంది అనే నమ్మకంతో సురేష్ బాబు ఆ దర్శకుడుతో స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ చేయించాడని తెలుస్తుంది.ప్రస్తుతం వెంకటేష్, నాగచైతన్యలు ఇద్దరు కూడా రెండేసి సినిమాలతో బిజీగా ఉన్నారు.

ఈ ప్రాజెక్ట్ లు పూర్తి అయిన తర్వాత ఈ మల్టీస్టారర్ కథని తెరపైకి తీసుకెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది.వెంకీ చైతూల కాంబోలో వచ్చిన వెంకీమామ సూపర్ హిట్ కావడంతో మరోసారి ఈ కాంబినేషన్ సెట్ అయితే దగ్గుబాటి, అక్కినేని ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు.2022లో మరోసారి వెంకీ మామ కాంబోను ప్రేక్షకులు చూసే అవకాశం ఉందని ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు