మోక్షం కోసం గుడికి వెళ్తే.. ప్రాణాలు పోయాయి!

వారంతా భక్తులు.మోక్షం కోసం, మొక్కులు తీర్చుకోవడానికి గుడికి వెళ్లారు.

 Vehicle Ran Over People Sleeping In The Premises Of The Temple In Karnataka Karn-TeluguStop.com

అక్కడ ఒక రోజు నిద్ర చేసి మరుసటి రోజు స్నానాది కార్యక్రమాలు పూర్తి అయ్యాక దేవుడి దర్శనం చేసుకోవాలని వారి ప్రణాళిక.గుడి ఆవరణలోనే నిద్రకు ఉపక్రమించారు.

అక్కడ వారితో పాటు మరికొంత మంది కూడా ఉన్నారు.అక్కడే పడుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఆ స్థలం కొంత రోడ్డుపైకి ఉంటుంది.అయినా సరే అక్కడ పడుకున్నారు.

కానీ అంతలోనే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.ఏదో అనుకుని పుణ్య క్షేత్రానికి వెళ్తే మరోటి జరిగింది.

అసలేం జరిగిందో తెలుసుకోండి.

అది కర్ణాటక కొప్పల్ ప్రాంతం.

అక్కడి హుళగెమ్మ దేవి మందిరం ఆవరణలో భక్తులు నిద్రపోతున్నారు.తెల్లారి లేచి దేవుడి దర్శనం చేసుకోవాలని అనుకుంటే.

వారి బతుకులు తెల్లారి పోయాయి.అటు వైపు నుండి వేగంగా వచ్చిన ఓ కారు నిద్రిస్తున్న భక్తులపై దూసుకెళ్లింది.ఈ ఘోర దుర్ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.మృతి చెందిన వ్యక్తిని బళ్లారికి చెందిన తిప్పన్నగా గుర్తించారు.ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్.

ఘటన తర్వాత కారుతో సహా పరార్ అయ్యాడు.ఈ దుర్ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

అసలు ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.దుర్ఘటనకు అతివేగమే కారణమా లేదా నిర్లక్ష్యమా.

లేదంటే కారు నడుపుతున్న డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా అనేది దర్యాప్తు చేస్తున్నారు.ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి.

వాటి ఆధారంగా పోలీసులు విచారణ సాగిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube