బాలయ్య, తారక్, కళ్యాణ్ రామ్ కు సక్సెస్ ఇచ్చిన ఈ విచిత్రమైన డైలాగ్స్ తెలుసా?

నందమూరి హీరోలకు ప్రేక్షకులలో ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

స్టార్ హీరో బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం సక్సెస్ లో ఉన్నారు.

గడిచిన ఎనిమిది నెలల్లో ఈ ముగ్గురు హీరోల సినిమాలు థియేటర్లలో విడుదల కాగా ఈ సినిమాలు సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి.అయితే నందమూరి హీరోలు రొటీన్ కు భిన్నమైన కథలను ఎంచుకున్న ప్రతిసారి విజయాలను అందుకున్నారు.

ఈ నందమూరి హీరోల సినిమాలలో విచిత్రమైన డైలాగ్స్ ఉన్నా సినిమా హిట్టేనని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.బాలయ్య సినీ కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో భైరవ ద్వీపం సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో బాలయ్య "మీరన్నది బాగున్నది నేననేది బహు బాగున్నదని మీచేత అనిపించమంటారా" అని చెప్పే వెరైటీ డైలాగ్ ఈ సినిమాకే హైలెట్ గా నిలిచింది.కమర్షియల్ గా ఈ సినిమా సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే.

Advertisement

బాలయ్యకు జోడీగా ఈ సినిమాలో రోజా నటించారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కిన యమదొంగ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమాలో తారక్ చెప్పిన భంభోళజంబ డైలాగ్ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది.

తారక్ తన స్టైల్ లో చెప్పిన ఈ డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.వీక్ డేస్ లో కూడా భారీగా కలెక్షన్లను సాధిస్తూ ట్రేడ్ విశ్లేషకులను సైతం ఈ సినిమా ఆశ్చర్యానికి గురి చేస్తోంది.ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ చెప్పిన జగత్ జజ్జరికా డైలాగ్ సినిమాకు హైలెట్ గా నిలిచింది.

నందమూరి హీరోలకు ఈ వెరైటీ డైలాగ్స్ కలిసొస్తుండటం గమనార్హం.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

Advertisement

తాజా వార్తలు