చిరంజీవి చెల్లెళ్ళుగా మారబోతున్న వరలక్ష్మి శరత్ కుమార్

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రస్తుతం మంచి భూమ్ లో ఉన్న నటి వరలక్ష్మి శరత్ కుమార్ .ఈ ఏడాది క్రాక్, నాంది సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న ఈ అమ్మడు రెండు సినిమాలలో భిన్నమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులని మెప్పించింది.

 Varalakshmi Turned As A Megastar Sister For Lucifer Remake, Tollywood, Telugu Ci-TeluguStop.com

ఇక క్రాక్ సినిమాలో జయమ్మ పాత్ర అందరికి భాగా కనెక్ట్ అయిపొయింది.ఈ నేపధ్యంలో టాలీవుడ్ లో అందరూ వరలక్ష్మికి జయమ్మ అనే పేరు పెట్టేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఇప్పుడు ఈ భామకి వరుస అవకాశాలు తెలుగులో వచ్చి పడుతున్నాయి.స్టార్ హీరోల సినిమాలలో ఛాన్స్ లు దక్కించుకుంటుంది.

ఇప్పటికే కొరటాల శివ అల్లు అర్జున్ తో తీయబోయే నెక్స్ట్ సినిమాలో పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ పాత్ర కోసం వరలక్ష్మి శరత్ కుమార్ ని సంప్రదించడం జరిగిందని, ఆమె కూడా కథ విని చేయడానికి ఒప్పుకుందనే టాక్ వినిపిస్తుంది.ఇప్పుడు మరో క్రేజీ న్యూస్ టాలీవుడ్ లో వైరల్ గా మారింది.

మెగాస్టార్ చిరంజీవి మోహన్ కృష్ణ దర్శకత్వంలో లూసీఫర్ సినిమా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇక లూసీఫర్ లో మోహన్ లాల్ చెల్లెళ్ళు పాత్ర ఒకటి ఉంటుంది.

ఆ పాత్రకి సినిమాలో మంచి ప్రాధాన్యత ఉంటుంది.అయితే ఆ పాత్రకి కాస్తా మార్పులు చేసి చిరంజీవి భార్యగా మార్చి నయనతారని తీసుకోవాలని ప్లాన్ చేశారని టాక్ వినిపించింది.

ఆరంభంలో అయితే ఆ పాత్ర కోసం కీర్తి సురేష్, సాయి పల్లవి పేర్లు కూడా వినిపించాయి.అయితే ఇప్పుడు ఈ ప్లేస్ లోకి జయమ్మ వచ్చి చేరింది.

క్రాక్, నాంది సినిమాలలో వరలక్ష్మి పెర్ఫార్మెన్స్ చూసిన చిరంజీవి లూసీఫర్ రీమేక్ లో తన చెల్లి పాత్ర కోసం ఆమెని తీసుకోవాలని దర్శకుడుకి చెప్పడం జరిగిందని బోగట్టా.ఇక చిరంజీవితో ఉన్న సాన్నిహిత్యం కొద్ది వరలక్ష్మి కూడా చేయడానికి సుముఖంగానే ఉన్నట్లు టాక్ నడుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube