టీడీపి రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జూనియర్ ఎన్టీఆర్ కు సన్నిహితులలో ఒకరనే సంగతి తెలిసిందే.వంశీ ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని బాగుండేవారని ఆ సర్కిల్ కావడంతో వాళ్లతో నాకు కూడా పరిచయం ఏర్పడిందని వంశీ అన్నారు.
ఒకప్పుడు మా మధ్య బాండింగ్ బాగుండేదని ప్రస్తుతం రాజకీయాల వల్ల పరిస్థితులు మారాయని ఆయన తెలిపారు.
తారక్ ప్రస్తుతం అతని కెరీర్ ను అతను చూసుకుంటున్నాడని వల్లభనేని వంశీ వెల్లడించారు.
చంద్రబాబు చెప్పిన విషయాలు నిజమే అయితే సీనియర్ ఎన్టీఆర్ వారసులు ఇతర పార్టీలపై ఎందుకు దృష్టి పెట్టారని వంశీ కామెంట్లు చేశారు.కూతురు పెళ్లి అయ్యే వరకు బాలకృష్ణ టీడీపీతో అంటీముట్టనట్టుగా ఉన్నారని వంశీ చెప్పుకొచ్చారు.2009 సంవత్సరం సమయంలో తారక్ చిన్న పిల్లాడు అని అప్పటికే అతనికి ఊహించని రేంజ్ లో క్రేజ్ ఉందని పేర్కొన్నారు.
ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ను పణంగా పెట్టి ప్రచారం చేశారని వంశీ తెలిపారు.
నాకు సీటు ఇచ్చే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తో మాట్లాడకూడదని చంద్రబాబు నాయుడు ఒట్టు వేయించుకున్నారని వంశీ కామెంట్లు చేశారు.
వల్లభనేని వంశీ వెల్లడించిన షాకింగ్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.2014 ఎన్నికల్లో గెలిచిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కు పట్టించుకున్నారా అని ఆయన ప్రశ్నించారు.
ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించాలని కోరడం కరెక్టా అని ఆయన అన్నారు.
హ్యూమన్ ఎమోషన్స్ ను టార్గెట్ చేసి చంద్రబాబు రాజకీయాలు చేస్తారని వల్లభనేని వంశీ వెల్లడించారు.రామారావు గారు, వైఎస్సార్ గారు ప్రజల కోసం ఎన్నో స్కీమ్స్ అమలు చేశారని ఆయన పేర్కొన్నారు.
చంద్రబాబు 14 ఏళ్లు పాలించినా ప్రజలకు దక్కిన ప్రయోజనం ఏంటని వంశీ పరోక్షంగా ప్రశ్నించారు.
తాజా వార్తలు