గణేష్ నిమజ్జనం సందర్భంగా కొత్తపల్లి.సాయి అనే వ్యక్తిపై ఆత్మహత్యకు పాల్పడిన పప్పుల సాయి అనే వ్యక్తే ముందు దాడి చేశాడు.
పప్పుల సాయి వల్లే అసలు అక్కడ గొడవ మొదలైంది.పప్పుల సాయి ఆత్మహత్యకు నాకు గాని,మా పార్టీ నాయకులకు గాని ఎటువంటి సంబంధం లేదు, శ్రీరామవరం గ్రామంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా రెండు వర్గాలు మద్య గొడవ జరిగింది.
అంతే తప్పా జరిగిన గొడవలకు నాకు ఎటువంటి సంబంధం లేదు.రెండు వర్గాలు మధ్య గొడవ జరిగిన సమయంలో నేను అమరావతిలో దెందులూరు నియోజకవర్గ స్థాయి పార్టీ సమావేశంలో ఉన్నా.
జరిగిన ఘటనకు నాకు సంబంధం ఉందని నిరూపిస్తే శాశ్వత రాజకీయ సన్యాసం చేస్తా.బాధితుడి కుటుంబంలో చేయూత,జలకళ పధకం క్రింద పొలంలో బోరు కూడా మంజూరు చేశాం శంకుస్థాపన కూడా నేనే చేశాను.
చింతమనేని ప్రభాకర్ కు దమ్ముంటే జరిగిన సంఘటనను నిరూపించాలని సవాల్ జరిగిన గొడవను నాపై మా పార్టీపై వేసేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు.చింతమనేని మాదిరిగా మట్టి, గ్రావెల్,ఇసుక అమ్ముకుని బ్రతికే అలవాటు నాకు లేదు.