అమెరికా అధ్యక్షుడు జో బైడెన్( Joe Biden ) కొలువులో మరో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి లభించింది.ఆ దేశ విదేశాంగ శాఖలో శక్తివంతమైన డిప్యూటీ సెక్రటరీ (మెయింటినెన్స్ , రిసోర్సెస్) పదవికి ఇండో అమెరికన్ న్యాయవాది, దౌత్యవేత్త రిచర్డ్ వర్మ( Diplomat Richard Verma ) నియమితులయ్యారు.
ఈ మేరకు ఆయన నియామకానికి సంబంధించి గురువారం జరిగిన ఓటింగ్లో సెనేట్ 67-26 మెజార్టీతో ఆమోదం తెలిపింది.
కాగా.
వర్మ ప్రస్తుతం మాస్టర్ కార్డ్ గ్లోబల్ పబ్లిక్ పాలసీకి జనరల్ కౌన్సెల్, హెడ్గా విధులు నిర్వర్తిస్తున్నారు.ఈ హోదాలో ఆయన అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా వున్న కంపెనీ చట్టం, విధానపరమైన విధులను పర్యవేక్షిస్తారు.
డెమొక్రాటిక్ పార్టీకి చెందిన రిచర్డ్ వర్మ 2014 నుంచి 2016 వరకు భారత్లో అమెరికా రాయబారిగా వ్యవహరించారు.ఈ ఏడాది ప్రారంభంలోనూ బైడెన్ తన ఇంటెలిజెన్స్ అడ్వైజరీ బోర్డులో సభ్యుడిగానూ రిచర్డ్ వర్మను నియమించిన సంగతి తెలిసిందే.
ప్రెసిడెంట్స్ ఇంటెలిజెన్స్ అడ్వైజరీ బోర్డ్ (పీఐఏబీ) అనేది అధ్యక్షుని కార్యనిర్వాహక కార్యాలయంలో స్వతంత్ర ప్రతిపత్తి గల ఒక ఏజెన్సీ .
ఇకపోతే.రిచర్డ్ వర్మ తల్లిదండ్రులు భారత్ నుంచి 1960వ దశకంలో అమెరికాకు వలస వెళ్లారు.ఆయన తండ్రి దాదాపు నలభై ఏళ్ల పాటు యూనివర్సిటీ ఆఫ్ పీట్స్బర్గ్లో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేశారు.
వర్మ తల్లి కూడా ఉపాధ్యాయురాలు కావడం విశేషం.జాన్స్టౌన్( Johnstown ), పెన్సిల్వేనియాలలో రిచర్డ్ వర్మ పెరిగారు.
వెస్ట్మాంట్ హిల్టాప్ స్కూల్ డిస్ట్రిక్ట్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు.జార్జ్టౌన్ యూనివర్సిటీలో పీహెచ్డీ, జార్జ్టౌన్ యూనివర్సిటీ లా సెంటర్లో ఎల్ఎల్ఎం, వాషింగ్టన్ కాలేజ్ ఆఫ్ లాలో జేడీ, లెహి వర్సిటీలో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో బీఎస్ చేశారు.
ఇదిలావుండగా.యూఎస్ ఎయిర్ఫోర్స్కు అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్గా భారత సంతతికి చెందిన రవి చౌదరిని( Ravi Chaudhary ) నామినేట్ చేస్తూ బైడెన్ తీసుకున్న నిర్ణయానికి కొద్దిరోజుల క్రితం సెనేట్ ఆమోదముద్ర వేసింది.65-29 ఓట్ల తేడాతో సెనేట్ ఆయన నియామకాన్ని ఆమోదించింది.అంతేకాదు.
రవి చౌదరికి అనుకూలంగా ఓటు వేసిన వారిలో డజను మందికి పైగా రిపబ్లికన్లు వుండటం విశేషం.దీంతో యూఎస్ ఎయిర్ఫోర్స్కు సహాయ కార్యదర్శిగా పనిచేసిన తొలి భారత సంతతి వ్యక్తిగా రవి చౌదరి చరిత్ర సృష్టించారు.