ప్రస్తుతం చలి కాలం (వింటర్ సీజన్) కొనసాగుతున్న సంగతి తెలిసిందే.మిగిలిన సీజన్స్ గురించి పక్కన పెడితే.
ఈ సీజన్లో మాత్రం ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి.ఎందుకంటే.
ఈ సీజన్లో మంచు, చలే కాదు రోగాలు కూడా అత్యధికంగానే ఉంటాయి.ఈ రోగాలు ఎప్పుడు, ఎటు నుంచి ఎటాక్ చేస్తాయో కూడా ఊహించలేము.
అందుకే మన ఆరోగ్యాన్ని మనమే జాగ్రత్తగా కాపాడుకోవాలి.ఇక ఈ సీజన్లో కొన్ని కొన్ని ఆహారాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
అలాంటి వాటిలో పాలు మరియు ఖర్జూరం కాంబినేషన్ ది బెస్ట్ అని చెప్పాలి.
పాలు, ఖర్జూరం రెండు విడి విడిగా ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలను అందిస్తాయని అందరికీ తెలుసు.
కానీ, రెండు కలిపి తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు పొందొచ్చు.ముఖ్యంగా ఈ చలి కాలంలో పాలతో పాటు ఖర్జూరం కలిపి తీసుకోవడం వల్ల సూపర్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.
మరి ఆ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.ఒక గ్లాస్ పాలతో పాటు రెండు ఖర్జూర పండ్లను లేదా పాలలో ఖర్జూరాలను నానబెట్టి రెగ్యులర్గా తీసుకోవాలి.
ఇలా తీసుకోవడం వల్ల ఎన్నో పోషక విలువలు శరీరానికి అందడంతో పాటు.ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.ఫలితంగా చలి కాలంలో వచ్చే రోగాలకు దూరంగా ఉండొచ్చు.అలాగే ఈ వింటర్ సీజన్లో చర్మం పొడిబారిపోతూ.
అందహీనంగా మారుతుంది.అయితే పాలతో పాటు ఖర్జూరం తీసుకోవడం వల్ల.
చర్మం పొడిబారడం తగ్గి మృదువుగా, యవ్వనంగా మరియు కాంతివంతంగా మారుతుంది.ఇక ఈ చలి కాలంలో గుండె పోటు వచ్చే రిస్క్ కాస్త ఎక్కువగానే ఉంటుంది.
అయితే పాలతో ఖర్జూరం తీసుకోవడం వల్ల గుండె జబ్బులకు దూరంగా ఉండొచ్చు.
రక్త హీనత సమస్యను నివారించి.శరీరానికి ఐరన్ అందించడంలో పాలు మరియు ఖర్జూరం కాంబినేషన్ గ్రేట్గా సహాయపడుతుంది.అలాగే జీర్ణ సంబంధిత సమస్యలను ఎదుర్కొనే వారు ప్రతి రోజు పాలుతో పాటు రెండు ఖర్జూరాలను తీసుకోవాలి.
ఇలా చేస్తే.గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
.