నందమూరి -ఘట్టమనేని కుటుంబాల మధ్య వైరం గురించి బాలయ్య ప్రశ్నిస్తారా?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వెండి తెరపై హీరోగా మాత్రమే కాకుండా, ఆహా వేదికగా ఓటీటీలో ప్రసారమయ్యే అన్ స్టాపబుల్  కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ కార్యక్రమం ఎంతో ప్రేక్షకాదరణ దక్కించుకుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇకపోతే ఇప్పటికే ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది సినీ సెలబ్రిటీలు హాజరై వారి వ్యక్తిగత విషయాల గురించి చర్చించారు.అదే విధంగా ఆ హీరోలతో కాని ఆ కుటుంబంతో గాని బాలకృష్ణకు ఉన్న గొడవలు మనస్పర్థలు గురించి కూడా ఈ సందర్భంగా బాలకృష్ణ బయటపెట్టారు.

తాజాగా రవితేజ ఈ కార్యక్రమానికి హాజరు కాగా వారి గురించి వస్తున్న వార్తలపై ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆ వార్తలకు చెక్ పెట్టారు.ఇక పోతే ఈ కార్యక్రమానికి మహేష్ బాబు హాజరయ్యారని త్వరలోనే ఆ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుందని వార్తలు వస్తున్నాయి.

అయితే నందమూరి కుటుంబం ఘట్టమనేని కుటుంబం మధ్య కొన్ని దశాబ్దాల నుంచి వైరం ఉందనే విషయం మనకు తెలిసిందే.కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా విషయం నుంచి సీనియర్ ఎన్టీఆర్ కృష్ణ వరకు వివాదాలు తలెత్తాయి.

Advertisement

అప్పటి నుంచి పలు సినిమాల విషయంలో వీరిద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి.అందుకే అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ కు కృష్ణకు మధ్య ఎలాంటి మాటలు లేవు.కానీ జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు ఎంతో సన్నిహితంగా ఉంటారు.

ఇక బాలకృష్ణ ఈ కార్యక్రమంలో అప్పట్లో ఎన్టీఆర్, కృష్ణ మధ్య జరిగిన గొడవలు ఈ కుటుంబాల మధ్య ఉన్న వైరం గురించి ప్రస్తావిస్తారా? లేదా? అనే విషయం గురించి పలువురు ఎంతో ఆతృతగా ఈ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు.మరి ఈ విషయం గురించి క్లారిటీ రావాలంటే ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యే వరకు వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు