రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా వరల్డ్ వైడ్ హిట్ సాధించిన తర్వాత ఇక ఇప్పుడు చిన్న హీరోల దగ్గర నుంచి పెద్ద హీరోల వరకు ప్రతి ఒక్కరు కూడా తమ సినిమాలను పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కిసస్తూ ఉండటం గమనార్హం.ఇక ఇప్పుడూ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయ్.సినిమాలో లాగానే అప్పటి కాలం లోనే తొలి పాన్ ఇండియా సినిమా గా వచ్చింది నాగార్జున హీరోగా నటించిన రక్షకుడుఅనే సినిమా.97 లో అత్యంత ఖరీదైన భారతీయ సినిమాగా ఈ సినిమాను నిలిచింది.ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రచ్చ గన్ అనే సినిమాకి తెలుగు డబ్బింగ్ వర్షన్ టైటిల్ రాక్షసుడు.
అప్పట్లో యూత్ ఐకాన్ గా కొనసాగుతున్న నాగార్జున మిస్ వరల్డ్ సుష్మితా సేన్ హీరో హీరోయిన్ గా ఈ సినిమా తెరకెక్కింది.ఇక తన మ్యూజిక్తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.
ఈ సినిమాని అప్పట్లో 18 కోట్లతో జరిపించడం గమనార్హం.దీంతో ఈ సినిమా కాస్త భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఓ సెన్సేషన్ గా మారిపోయింది.
ఎక్కడికి వెళ్లిన ఎక్కడ చూసినా కూడా ఈ సినిమాకు సంబంధించిన వార్త కనిపించింది.

ఇప్పుడు 500 కోట్లతో సినిమా తీసిన ప్రేక్షకులను ఆశ్చర్య పోవడం లేదు కానీ అప్పుడు మాత్రం 18 కోట్లతో సినిమా తీస్తే ఏంటి ఒక్క సినిమాకి 18 కోట్లు పెట్టారా అని ప్రతి ప్రేక్షకుడు ఆశ్చర్యపోయాడు.సినిమా విడుదల కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తారు ఇక ఈ సినిమాలో కార్ రేస్ లు, యాక్షన్ సన్నివేశాలలో నాగార్జున చేసిన విధానం అన్నీ కూడా ఒక సెన్సేషన్ గానే మారిపోయాయి అని చెప్పాలి.

ఇక నాగార్జున కెరీర్లోనే అత్యధిక థియేటర్లలో విడుదలైన సినిమాగా కూడా రక్షకుడు సినిమా రికార్డు సృష్టించింది.ఈ సినిమా చూడకపోతే లైఫ్లో ఒక మంచి మధురానుభూతి మిస్ అవుతాము అన్న రేంజ్లో సినిమాకి ప్రచారం కూడా చేశారు కానీ చివరికి ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది.అనుభవం లేని దర్శకుడు ప్రవీణ్ గాంధీ ఈ సినిమాను బాగా హ్యాండిల్ చేయలేకపోయాడు దీంతో ఈ సినిమా ఫ్లాప్ గా మిగిలిపోయింది.







