టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుకున్నారు.
కానీ తెలంగాణ ప్రజల జీవితాలను మాత్రం మార్చలేకపోయారని ఎద్దేవా చేశారు.తెలంగాణలో కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని విమర్శించారు.
రాష్ట్రంలో ఇసుక మాఫియాతో పాటు అన్ని మాఫీయాలు తయారయ్యాయని మండిపడ్డారు.తెలంగాణలోకి ఈడీ, ఐటీని రావొద్దంటున్నారన్నారు.
ఈడీ రావాల్సిన పరిస్థితులు తెచ్చింది టీఆర్ఎస్ వాళ్లు కాదా అని నిలదీశారు.అవినీతి లేకుండా పాలన చేస్తే దర్యాప్తు సంస్థలు ఎందుకొస్తాయని ప్రశ్నించారు.
అనేక మంది మంత్రులు ఈడీ కేసుల్లో చిక్కుకుంటున్నారని తెలిపారు.