ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి గుడ్ న్యూస్ తెలియజేశారు.ఏపీ ప్రభుత్వం ముందుకు వస్తే లాజిస్టిక్ పార్క్, విజయవాడ బైపాస్ మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.
రాజమండ్రిలో హైవే పనులకు సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది.ఈ సందర్భంగా 2024 నాటికి ఈ హైవే పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
నేషనల్ హైవే 216 పై మోరంపూడి, జొన్నాడ జంక్షన్ , ఉండ్రజవరం జంక్షన్, తెత్తలి, కైకరం వద్ద నాలుగు లైన్ ల ఫ్లై ఓవర్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు.ఇందుకు సంబంధించి ₹3000 కోట్లను మంజూరు చేసినట్లు స్పష్టం చేశారు.
రాజమహేంద్రవరంలో ఫ్లైఓవర్ తో చాలావరకు ట్రాఫిక్ సమస్యలు తగ్గనున్నాయని ఈ సందర్భంగా జనాలు అంటున్నారు.మోరంపూడి ఫ్లైఓవర్ శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమం అనంతరం కడియపులంకలో సత్యదేవ్ నర్సరీనీ నితిన్ గడ్కరీ సందర్శించారు.
ఈ సందర్భంగా సత్యదేవ్ యాజమాన్యం.గడ్కరీకి గుర్తుండిపోయే రీతిలో ఫ్లెక్సీలతో పాటుగా పూలతో గడ్కరీ చిత్రాన్ని ఆవిష్కరించటంతో.
గడ్కరీ.ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
పూలతో అల్లిన తన చిత్రాన్ని చూస్తూ నిలిచిపోయారు.