పుణ్యం కోసం గుడికెళ్తే పాపం ఎదురవ్వడమంటే ఇదేనేమో.ఒక ప్రభుత్వ ఉద్యోగి భగవంతునికి తలనీలాలు అర్పించి మొక్కు తీర్చుకున్నాడు.
అయితేనేమి మంచి పనే కదా అని అనుకుంటున్నారా.కానీ తాను అలా చేసినందుకు విచిత్రంగా వుద్యోగం పోగొట్టుకున్నాడు.
ఆశ్చర్యంగా వుంది కదూ.అవును, ప్రస్తుతం ఆయన సస్పెండ్ అయ్యి ఇంటి దగ్గర కూర్చుకున్నారు.APలోని శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణం, మేలాపురం ప్రభుత్వ పాఠశాలలో ఆదినారాయణ టీచర్ గా పని చేస్తున్నాడు.
అతగాడికి కాస్త దైవభక్తి ఎక్కువే.
మొక్కుబడి కారణంగా గత నెల 5న కర్ణాటకలోని పావగడ శనేశ్వర స్వామి గుడికి వెళ్లి గుండు గీయించుకొని మొక్కులు చెల్లించాడు.ఆ తర్వాత విధులకు హాజరయ్యేందుకు పాఠశాలకు వచ్చి ఫేషియల్ యాప్ లో హాజరు వేయబోయారు.
అయితే గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటి ఫోటోకు ఇప్పటి గుండుతో ఉన్న ఫోటోకు మ్యాచ్ కాకపోవడంతో ఇతని అటెండెన్స్ ను రిజెక్ట్ చేసింది.కాగా దీనిపై టీచర్ ఆదినారాయణ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
అక్కడితో కథ అక్కడితో అయిపోలేదు.ఈ విషయం ఆనోటా ఈనోటా చేరి ఆఖరికి మీడియాకు తెలిసింది.
దాంతో ఆ తంతు కాస్త ఛానల్స్ లో, పత్రికల్లో వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
దాంతో నెట్టింట్లోని జనాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
అయితే ఈ వ్యవహారం ఆయన ఉద్యోగానికే ఎసరు తెచ్చి పెట్టింది.ఈ విషయం మీడియాకు, సోషల్ మీడియాకు తెలిసినందుకు అధికారులు ఆదినారాయణపై కోపాన్ని ప్రదర్శించారు.
అయితే తనకే పాపం తెలియదని ఆయన మొత్తుకున్నా వినిపించుకోని అధికారులు దీనిపై విచారణ చేపట్టి ఈ నెల 17న ఆయనకు మెమో జారీచేశారు.దీనికి ఆయన క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు.
క్లారిఫికేషన్ నచ్చని అధికారులు ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.