మెగా హీరో సాయిధరమ్ తేజ్ తాజాగా విరూపాక్ష (Virupaksha) సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చారు.ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
ఇలా ఈ సినిమాకు మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ రావడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులతో కలిసి థియేటర్లో సినిమా చూసినటువంటి సాయి ధరమ్ తేజ్ ( Sai Dharam Tej ).సినిమా పూర్తి అవ్వగానే థియేటర్ బయటకు వచ్చి ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ క్రమంలోనే డైరెక్టర్ కార్తీక్ దండు( Karthik Dandu ) ను ఒక్కసారిగా హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.సాయిధరమ్ తేజ్ కి ఈ సినిమా ఎంతో స్పెషల్ అనే చెప్పాలి.
రెండేళ్ల క్రితం ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఆ ఇబ్బందుల నుంచి బయటపడి తిరిగి సినిమాలలోకి వచ్చారు.సినిమా షూటింగ్ సమయంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్న లెక్కచేయకుండా తన లక్ష్యాన్ని చేరుకునే దిశగా అడుగులు వేశారు.
సినిమా షూటింగ్ పూర్తి అయిన ఆయన రెస్ట్ తీసుకోకుండా ప్రమోషన్ కార్యక్రమాలను( Promotional programs ) కూడా తన భుజాన వేసుకొని వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాకు కావలసిన స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.ఇలా సినిమా కోసం ఎంతో కృషి చేసిన సాయి ధరమ్ తేజ్ కి ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఫలితాన్ని అందించిందని చెప్పాలి.ఇలా రెండు సంవత్సరాలు ఈయన అనుభవించిన ఆ నరకానికి సరైన ఫలితం దక్కడంతో ఒక్కసారిగా హీరో ఎమోషనల్ అయ్యారు.ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా కలెక్షన్లను కూడా రాబడితే సాయిధరమ్ కెరియర్ లో ఈ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పాలి.