ఉత్తమ్, జానారెడ్డిలు టీఆర్ఎస్ పాలనను విమర్శించడం సరికాదు.. గుత్తా సుఖేందర్ రెడ్డి

నల్గొండ జిల్లా: మిర్యాలగూడ కాంగ్రెస్ సభలో ఆ పార్టీ నేతలు ఉత్తమ్, జానారెడ్డిలు టీఆర్ఎస్ పాలనను విమర్శించడం సరికాదని టీఆర్ఎస్ నేత, శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.గురువారం నల్గొండలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కలలు కంటున్నారని, రాదన్న విషయం వారికీ తెలుసునని అన్నారు.

 Trs Leader Gutta Sukhender Reddy Comments On Uttham And Janareddy Details, Trs L-TeluguStop.com

కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు ఇతర పార్టీలకు వెళ్లకుండా కాపాడుకునేందుకే టీఆర్ఎస్ పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తన్నుకోవడంలోనే వారి పరిస్థితి ఏమిటో తెలుస్తోందన్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నియోజకవర్గంలోనే గుండు పగిలే పరిస్థితి ఏర్పడిందన్నారు.

సంక్షేమ పాలన టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని, మళ్ళీ కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube