దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం పొన్నియిన్ సెల్వన్. ఈ సినిమా దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అన్న విషయం మనందరికీ తెలిసిందే.
చోళ సామ్రాజ్య వైభవాన్ని, అప్పటి రాజకీయ తంత్రాలను ఈ సినిమాలో ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు మణిరత్నం.కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.
ఈ సినిమాలో త్రిష తో పాటు విక్రమ్, కార్తి, జయంరవి, ఐశ్వర్యరాయ్ బచ్చన్, శోభిత ధూళిపాళ, శరత్కుమార్, పార్తిబన్ తదితరులు నటిస్తున్న విషయం తెలిసిందే.
అయితే విడుదల తేదీకి మరికొద్ది రోజులే సమయం ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు.
ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా ఇందులో ముఖ్యపాత్రలో నటించిన హీరోయిన్ త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కాగా ఈ సినిమాలో త్రిష చోళ దేశపు రాకుమారి కుందవై పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఆమెకు లుక్ కీ సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.కాగా ఈ సినిమాలో త్రిష ఎంతో అందంగా ఒంటినిండా నగలను ధరించి కనిపించిన విషయం తెలిసిందే.
అయితే ఆ పాత్రకు ధరించిన నగలు నిజమైనవే అని తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా తెలిపారు త్రిష.కుందవై పాత్ర కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం.ఆనాటి రాజుల ఆహార్యం తలపించేలా దుస్తులు, నగలను ఎంపిక చేశారు.సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నేను నిజమైన నగలే ధరించాను.మాకు సహకారం అందించినందుకు ధన్యవాదాలు.మణిరత్నం చిత్రంలో నేనూ ఒక భాగం కావటం సంతోషంగా ఉంది.
నా పాత్రకు నేను న్యాయం చేశానని అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది త్రిష.