యాదాద్రి భువనగిరి జిల్లా: బొమ్మలరామారం మండల పరిధిలోని వాలుతండా,సీత తండా వాసులు మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత 5 రోజులుగా గ్రామంలో నీటి సరఫరా లేక కిలో మీటర్ నడిచి వెళ్లి ఊరి బయట ఉన్న బోరుబావి నుండి బిందెలతో నీళ్లను తెచ్చుకుంటున్నామని,
ఎవరికి చెప్పినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వాపోతున్నారు.
గ్రామంలో ఒకే బోరు ఉండడంతో నీటి సరఫరా సక్రమంగా లేక తాగునీటికి ఇబ్బంది పడుతున్నామని,ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మంచి నీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.