టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది.సినీ దర్శకుడు సూర్యకిరణ్( Director Surya Kiran ) కన్నుమూశారు.
గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.ఈ క్రమంలోనే ఆరోగ్యం విషమించడంతో సూర్య కిరణ్ తుది శ్వాస విడిచారు.
సత్యం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ఆయన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.సత్యం( Satyam )తో పాటు ధన 51, బ్రహ్మస్త్రం, రాజు భాయ్ వంటి సినిమాలకు డైరెక్టర్ గా పని చేశారు.
తెలుగులోనే కాకుండా తమిళంలోనూ పలు సినిమాలకు సూర్య కిరణ్ దర్శకుడిగా పని చేశారు.బాలనటుడిగా రెండు కేంద్ర ప్రభుత్వ అవార్డులు, దర్శకుడిగా రెండు నంది అవార్డులను అందుకున్నారు.హీరోయిన్ కల్యాణిని( Heroine Kalyani ) ప్రేమించి పెళ్లి చేసుకున్న సూర్యకిరణ్ కొన్నేళ్ల తరువాత విడిపోయారు.సూర్యకిరణ్ మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
రేపు చెన్నైలో సూర్యకిరణ్ అంత్యక్రియలు జరగనున్నాయి.