ఒక సినిమా సక్సెస్ సాధించాలన్నా ఫెయిల్యూర్ కావాలన్నా అందులో దర్శకుని పాత్ర ఎంతో కీలకమనే సంగతి తెలిసిందే.ఈ మధ్య కాలంలో కొందరు దర్శకులకు సైతం హీరోలకు సమాన స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
రాజమౌళి, ప్రశాంత్ నీల్, శంకర్, మరి కొందరు దర్శకులకు భారీస్థాయిలో అభిమానులు ఉన్నారు.అయితే ఈ దర్శకుల పారితోషికాలు కూడా అంచనాలకు అందని స్థాయిలో ఉన్నాయి.
స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాకు రెమ్యునరేషన్ కు బదులుగా లాభాల్లో వాటా తీసుకున్నారు.ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా జక్కన్నకు 100 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ దక్కిందని వార్తలు వచ్చాయి.
మరో స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజీఎఫ్2 సక్సెస్ అనంతరం తన పారితోషికాన్ని అమాంతం పెంచేశారని సమాచారం.పుష్ప ది రూల్ కోసం సుకుమార్ 50 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారని వార్తలు వచ్చాయి.
మరో స్టార్ డైరెక్టర్ శంకర్ చరణ్ సినిమా కోసం ఏకంగా 40 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారు.
చరణ్ సినిమాతో సక్సెస్ సాధిస్తే శంకర్ పారితోషికం పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.కొరటాల శివ సైతం ఒక్కో సినిమాకు 25 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.కొన్ని సినిమాలకు రెమ్యునరేషన్ కు బదులుగా కొరటాల శివ ఒక ఏరియా హక్కులను తీసుకుంటున్నారని తెలుస్తోంది.
లైగర్ సినిమాతో పూరీ జగన్నాథ్ రెమ్యునరేషన్ కూడా పెరిగిందని ఈ డైరెక్టర్ 20 కోట్ల రూపాయల రేంజ్ లో తీసుకుంటున్నారని బోగట్టా.దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక్కో సినిమాకు 25 కోట్ల రూపాయల నుంచి 30 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.మరి కొందరు డైరెక్టర్లు వరుస విజయాలను సాధించి ఈ జాబితాలో చేరాలని కృషి చేస్తున్నారు.వచ్చే ఏడాది నాటికి ఈ జాబితాలో చేరే డైరెక్టర్లు ఎవరో చూడాల్సి ఉంది.