ఇటీవల కాలంలో సినిమా థియేటర్ కి ప్రేక్షకుడిని తీసుకు రావడం చాల కష్టంగా మారిన సంగతి మనకు తెలిసిందే.అందుకే ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టుగా దర్శకులు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నారు.
పెద్ద సినిమాలకు ఎలాగూ ప్రేక్షకులు బాగున్నా బాగోలేకపోయిన ఓపెనింగ్ కలెక్షన్స్ తో గట్టెక్కేయచ్చు.కానీ చిన్న సినిమాలకు ఫస్ట్ కూడా బుకింగ్స్ లేవు.
ఇక ఈ రోజు విడుదల ఆయినా ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి కి అయితే థియేటర్ లో పది మంది కూడా లేరు.ఒకసారి సినిమా విడుదల అయ్యింది అంటే మొదటి రోజు దానికి వచ్చే టాక్ తోనే ఆ సినిమా భవిష్యత్తు తేలిపోతుంది.
ఇది జరగకూడదు అంటే మొదటి రోజు మంచి హైప్ తో చిత్రాలు విడుదల అవ్వాలి.
లేదంటే అడ్వాన్స్ బుకింగ్స్ గురించి మర్చిపోవాల్సిందే.ఆ హైప్ లేకపోతే ఓటిటి రైట్స్ కొనడానికి కూడా ఎవరు ముందుకు రారు.ఇక శాటిలైట్, ఓవర్సీస్ రైట్స్ గురించి మర్చిపోవాల్సిందే.
ఇవన్నీ కావాలంటే మంచి పబ్లిసిటీ కావలి.మరి ఆలా కావాలంటే గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ లు, ఆడియో రిలీజ్ ఫంక్షన్ గట్రా చేయాలి.
ఇది అంత చేయాలంటే బోలెడంత డబ్బుతో కూడుకున్న వ్యవహారం.జర్నలిస్టులు.
హోటల్ ఖర్చులు, కవరేజి ప్రలోభాలు వెరసి బోలెడు అంత తడిసి మోపెడు అవుతుంది.అందుకే సోషల్ మీడియా ను వాడుకలోకి తెస్తున్నారు.
పోస్టర్ రిలీజ్ నుంచి, లిరికల్ సాంగ్స్, గ్లిమ్స్, టీజర్స్, ట్రైలర్స్ అన్ని కూడా సోషల్ మీడియా లో విడుదల చేస్తున్నారు.
సినిమా విడుదలకు ముందే కావాల్సిన మౌత్ టాక్ కోసం మొట్ట మొదటి సారి దిల్ రాజు( Dil Raju ) ఒక కొత్త ప్రయోగం కూడా చేసాడు.అదే కొంత మంది సెలెక్టెడ్ పీపుల్ ని తీసుకొని సినిమా చూపించి వారితో రివ్యూ లు రాయించి కావాల్సినంత హైప్ క్రియేట్ అయ్యేలా చేయించుకోవడం.దీని కోసం అయితే పైసా ఖర్చు లేకుండా పబ్లిసిటీ వస్తుంది.
ఇలా ప్రీమియర్స్ ద్వారా ప్రచారం చేసుకోవచ్చు అనే ఒక నమ్మకం ఇచ్చాడు దిల్ రాజు బలగం సినిమా( Balagam ) అలాగే హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.కానీ బలగం విజయానికి వంద కారణాలు ఉన్నాయ్.
ఇక ఇప్పుడు రంగమార్తాండ ( Ranga Maarthaanda )వంతు వచ్చింది.కానీ బలగం సినిమాకు వచ్చిన హైప్ ఎందుకో రంగమార్తాండ కు రాలేదు అని అనిపిస్తుంది.