తారక్ నుంచి రామ్ చరణ్ వరకు చాలా ఏళ్ళ నుంచి స్క్రీన్ మీద కనిపించని స్టార్స్ వీళ్ళే

టాలీవుడ్ స్టార్ హీరోలు ఏడాదిలో రెండు సినిమాలు చేయడమే చాలా కష్టమైపోయింది ఇప్పుడు.

ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ, నట సార్వభౌమ ఎన్టీఆర్, కృష్ణం రాజు తదితర సీనియర్ హీరోలు ఏడాదికి పది లేదా పన్నెండు సినిమాలు చేసేవారు.

ఆ సినిమాలు చూసి ప్రేక్షకులు వారిని బాగా ఆదరించేవారు.అయితే, ప్రస్తుతం అటువంటి పరిస్థితులు లేవు.

మధ్యలో కరోనా కూడా రావడం వల్ల సినిమాలు చేయడం బాగా లేటయింది.దాంతో ఈ స్టార్ హీరోలను ప్రేక్షకులు వెండితెరపైన చూసి చాలా రోజులయింది.

వారు ఎవరంటే.జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ప్రభాస్, చిరంజీవి, బాలయ్య, వెంకటేశ్, కల్యాణ్ రామ్, వరుణ్ తేజ్, అఖిల్, అల్లు శిరీష్.

Advertisement

వీళ్లు వెండితెరపైన కనబడక దాదాపు రెండేళ్లు దాటుతోంది.జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేతచిత్రంలో ప్రేక్షకులకు కనిపించాడు.

ఆ తర్వాత ఆర్ఆర్ఆర్’సినిమాలో ఫుల్ బిజీగా అయిపోయాడు.రామ్ చరణ్ తేజ్ సంగతి కూడా అంతేవినయ విధేయ రామ’ ఫిల్మ్ ద్వారా ప్రేక్షకులను పలకరించిన చెర్రీ ఆ తర్వాత ఆర్ఆర్ఆర్బిజీలోనే ఉండిపోయాడు.

ప్రభాస్ ‘సాహో’ చిత్రం తర్వాత కనబడలేదు.ప్రజెంట్ వరుసగా సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు.చిరంజీవి చివరగా ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో కనిపించాడు.

ఆయన నటించిన ‘ఆచార్య’ ఫిల్మ్ ఆల్రెడీ రిలీజ్ కావాల్సింది.కానీ, కొవిడ్ వల్ల పోస్ట్ పోన్ అవుతూనే వస్తోంది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

బాలయ్య రూలర్’చిత్రం తర్వాత ప్రేక్షకులకు కనబడలేదు.ప్రస్తుతం ‘అఖండ’ చిత్ర షూటింగ్‌లో బాలయ్య ఫుల్ బిజీగా ఉన్నాడు.

Advertisement

ఈ చిత్రం ఈ ఏడాది విడుదలయ్యే చాన్సెస్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక వెంకటేశ్ ఓటీటీలో ‘నారప్ప’ చిత్రంతో సందడి చేశాడు.అయితే , థియేటర్స్‌లో మాత్రం ‘వెంకీమామ’ చిత్రంలో చివరగా కనిపించాడు.వరుణ్ తేజ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘గద్దల కొండ గణేష్’ చిత్రంలో చివరగా కనిపించాడు.

ప్రస్తుతం ‘గని’ సినిమా షూటింగ్‌లో ఫుల్ బిజీ ఉన్నాడు.ఈ ఫిల్మ్ షూట్ దాదాపు కంప్లీట్ అయినట్లు సమాచారం.

అఖిల్.‘మిస్టర్ మజ్ను’ చిత్రంలో చివరగా కనిపించగా ఆయన నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ఈ నెల 15న విడుదల కానుంది.

అల్లు శిరీష్ ‘ఏబీసీడీ’ చిత్రంలో చివరగా కనిపించాడు.

తాజా వార్తలు