అందాలు ఆరబోస్తేనే అవకాశాలు వస్తాయని హీరోయిన్స్ అనుకుంటే.ఎక్స్ పోజింగ్ ఎక్కవ ఉంటేనే సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారని డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు భావిస్తున్నారు.
చాలా సినిమాల్లో హీరోయిన్ల అంగాంగ ప్రదర్శనకే దర్శకులు ఎక్కవ ప్రాధాన్యత ఇస్తున్నారు.ఇలాంటి సమయంలో ఇప్పటి వరకు ఎక్స్ పోజింగ్ చేయని నటీమణులు కొందరున్నారు.
వారు కేవలం నటనకు స్కోప్ ఉన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నారు.ఇంతకూ ఆ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం!
సౌందర్య:

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సౌందర్య.వంద సినిమాలకు పైగా నటించింది.ఎక్స్ పోజింగ్ జోలికి ఏనాడూ పోలేదు.
కేవలం తన యాక్టింగ్ తో ప్రేక్షకులను మెప్పించింది.ఎక్స్ పోజింగ్ డిమాండ్ చేసిన చాలా సినిమాలను ఆమె తిరస్కరించింది.
లయ:

తెలుగు అమ్మాయైన లయ కూడా అందాల ఆరబోతకు ఎప్పుడూ మొగ్గు చూపలేదు.35 సినిమాల్లో నటించిన లయ అన్నీ సంప్రదాయబద్దమైన పాత్రలే చేసింది.ప్రేమించు సినిమాలో అంధురాలి క్యారెక్టర్ చేసి నంది అవార్డును గెల్చుకుంది.
స్నేహ:

తెలుగు, తమిళ సినిమాల్లోని అందరు టాప్ హీరోలతో స్నేహ నటించింది.అయినా ఏ సినిమాలోనూ గ్లామర్ రోల్ చేయలేదు.వెండి తెరపై ఫ్యామిలీ లేడీగానే కనిపించింది.శ్రీరామదాసు మూవీలో తన నటనతో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది.
మీరా జాస్మిన్:

తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో దాదాపు 50 సినిమాలకు పైగా నటించింది ఈ బ్యూటీ.కానీ ఎందులోనూ గ్లామర్ పాత్రలు చేయలేదు.నటనకు అవకాశం ఉన్న క్యారెక్టర్లు మాత్రమే చేసింది.అంగాంగ ప్రదర్శన లేకుండానే టాప్ హీరోయిన్గా ఎదిగింది.
కళ్యాణి:

హీరోయిన్ కళ్యాణి కూడా గ్లామర్ పాత్రలకు దూరంగానే ఉంది.ఫ్యామిలీ క్యారెక్టర్లు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.వసంతం సహా పలు చిత్రాల్లో తన నటన ఎంతో నేచురల్గా ఉంది.ప్రేక్షకుల నుంచి ఈ సినిమాలకు చక్కటి గుర్తింపు కూడా వచ్చింది
నిత్యామీనన్:

ఇప్పుడున్న హీరోయిన్స్లో మంచి టాలెంట్ ఉన్న అమ్మాయి నిత్యా మీనన్.ఈమె ఇప్పటి వరకు గ్లామర్ రోల్స్ చేయలేదు.ఎక్కువగా యాక్టింగ్ కు స్కోప్ ఉన్న క్యారెక్టర్లు మాత్రమే చేస్తూ.ముందుకు సాగుతున్నది.
కీర్తి సురేష్:

తెలుగు, తమిళ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న కీర్తి సురేష్ కూడా ఇప్పటి వరకు గ్లామర్ పాత్రల జోలికి వెళ్లేదు.చక్కటి నటనకు అవకాశం ఉన్న పాత్రలను చేస్తూ ముందుకెళుతోంది.మహానటిలో తన నటనకు ఏకంగా జాతీయ అవార్డు దక్కింది.