టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకొని నేడు పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు ఎన్టీఆర్ ( NTR ) ఒకరు.ఈయన హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
అయితే ఇటీవల ఎన్టీఆర్ నటించినటువంటి త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు.ఇలా నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారనే విషయం మనకు తెలిసిందే.
ఈయన పెద్దలు కుదిర్చినటువంటి వివాహం చేసుకున్నారు. లక్ష్మి ప్రణతి ( Lakshmi Pranathi )అనే అమ్మాయిని వివాహం చేసుకున్నటువంటి ఎన్టీఆర్ ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యారు.తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్న సంగతి మనకు తెలిసిందే.ఇకపోతే ఎన్టీఆర్ గతంలో తన భార్య గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
పెళ్లి చూపులలో తన భార్య తనతో అసలు మాట్లాడలేదని ఎన్టీఆర్ పలు ఆసక్తికరమైనటువంటి విషయాలను వెల్లడించారు.
తన వివాహం పెద్దలు కుదిర్చిన వివాహం కావడంతో పెళ్లి చూపులకు సాంప్రదాయబద్ధంగా వెళ్ళమని అయితే లక్ష్మీ ప్రణతిని (Lakshmi Pranathi)పెళ్లి చూపులలో చూడగానే తనుకు నచ్చింది ఓకే అని చెప్పి వచ్చేసాను కానీ తనకు నేనంటే ఇష్టమా లేదా అన్న విషయం మనకు తెలియదు.నా పెళ్లి చూపులకు పెళ్ళికి దాదాపు 8 నెలల సమయం ఉందని ఈ ఎనిమిది నెలల కాలంలో ఎప్పుడు కూడా నేనంటే ఇష్టం అనే విషయాన్ని ప్రణతి నాకు చెప్పలేదని ఎన్టీఆర్ వెల్లడించారు.అంతేకాకుండా పెళ్లి తర్వాత కూడా నేనంటే నీకు ఇష్టమా లేక బలవంతంగా పెళ్లి చేశారా అన్న అనుమానం వచ్చి తనని అడిగానని తెలిపారు.
ఇలా పెళ్లయిన కూడా ప్రణతి నేనంటే ఇష్టం అనే విషయం చెప్పలేదు అంటూ ఎన్టీఆర్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్( Comments viral ) అవుతున్నాయి.కానీ ఆడవాళ్ళ ఆలోచనలను వారి ఇష్టాలను తెలుసుకున్నవాడు ఎప్పటికీ పర్ఫెక్ట్ అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ కామెంట్ చేశారు.ఇక ఎన్టీఆర్ అంటే ఇష్టం అనే విషయాన్ని మాటల ద్వారా తెలియ చేయకపోయినా తన నడవడిక వ్యవహారి శైలి ద్వారా లక్ష్మీప్రణతి తెలియజేస్తూ ఎన్టీఆర్ భార్యగా కొనసాగుతూ ఎన్టీఆర్ పరువు ప్రతిష్టలను మరింత పెంచారనే చెప్పాలి.నందమూరి కుటుంబ పరువు ప్రతిష్టలను కాపాడుతూ నందమూరి ఇంటి కోడలుగా కొనసాగుతున్నారు.
ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ ( Devara Movie )పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.