టాలీవుడ్ లో గమ్మత్తు సినిమా.. డ్రగ్స్ కేసులో ఈడీ ముందుకు పూరీ జగన్నాథ్

టాలీవుడ్ లో గమ్మత్తు సినిమా.డ్రగ్స్ కేసులో ఈడీ ముందుకు పూరీ జగన్నాథ్.

 Tollywood Director Puri Jagannath Infront Of Ed Over Drugs Case Investigation, T-TeluguStop.com

తెలుగు చిత్ర పరిశ్రమను షేక్ చేసిన డ్రగ్స్ కేసుకు సంబంధించిన కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్  డైరెక్టరేట్ విచారణ సోమవారం మొదలయ్యింది.

ఈ మేరకు ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ నుంచి ఈడీ అధికారులు వివరాలు సేకరించారు 2017 లో ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహించిన శ్రీనివాస్ సోమవారం అధికారులకు పూర్తి వివరాలు సమర్పించారు.ఇది ఈ మేరకు సినీ పరిశ్రమకు చెందిన 12 మందికి ఇప్పటికే నోటీసులు జారీ చేసింది టాలీవుడ్ డ్రగ్స్ కేసులో  మంగళవారం నుంచి ఈడీ విచారణ జరపనుంది.

దర్శకుడు పూరి జగన్నాథ్ మంగళవారం విచారణకు హాజరు కానున్నారు.ఇప్పటికే ముగ్గురు నిందితులను నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఈడీ ఆ ముగ్గురు ఇచ్చిన సమాచారంతో 12 మంది టాలీవుడ్ నటీనటులకు నోటీసులు జారీ చేసింది.

Telugu Tollywood, Drugs, Directorate, Puri Jagannath-Movie

వీరితో పాటు మరికొంత మంది పై విచారణ జరిపే అవకాశం ఉంది.టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు దర్శకుడు పూరిజగన్నాథ్ కి మంగళవారం ప్రశ్నించనున్నారు.ఈ మేరకు అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు సెప్టెంబరు 22 వరకు కొనసాగనుంది సినీ పరిశ్రమకు చెందిన 12 మంది కి నోటీసులు జారీ చేశారు నిర్దేశించిన తేదీల్లో విచారణకు హాజరు కావాలని సూచించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube