బాలయ్య బాబుతో జతకట్టనున్న ప్రభాస్ హీరోయిన్... 

ప్రస్తుతం నందమూరి నటసింహం బాలయ్య బాబు ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ చిత్రంలో బాలయ్య బాబు సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు.

అయితే ఇందులో భాగంగా ఇప్పటికే మొదటి హీరోయిన్ గా బాలీవుడ్ గ్లామర్ క్వీన్ నయనతార ఖరారు కాగా రెండవ హీరోయిన్ గా టాలీవుడ్ అందాల తార శ్రీయ ఖరారు అయినట్లు తెలుస్తోంది.అంతేగాక ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి నటువంటి కొన్ని కీలక సన్నివేశాల కోసం శ్రీయ షెడ్యూల్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

అయితే ఇది ఇలా ఉండగా గతంలో కూడా పలు చిత్రాల్లో శ్రీయ మరియు బాలకృష్ణ కలిసి నటించారు.దీంతో మరోసారి ఈ కాంబో రిపీట్ అవడంతో బాలయ్య బాబు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇది ఇలా ఉండగా శ్రియా శరణ్ ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నటువంటి ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది.అయితే పెళ్లయిన తర్వాత సినిమాలకు కొంత మేర దూరంగా ఉన్నటువంటి ఈ అమ్మడు కొంత గ్యాప్ తీసుకుని వరుస సినిమాలు చేస్తూ మళ్ళీ తన జోరు పెంచింది.

Advertisement
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

తాజా వార్తలు