ఏపీలో వైసీపీకి చెందిన కాపు సామాజికవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు సోమవారం భేటీకానున్నారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఈ సామాజిక వర్గ యువకులు అధికంగా మద్దతునిస్తున్నారు.
దీంతో వారిని తమ వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా వైసీపీకి చెందిన కాపు నేతలంతా నేడు భేటీ కానున్నారు.కాపు సామాజికవర్గం వైసీపీ వెంటే ఉందన్న సందేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో సమాలోచనలు చేయనున్నారు.