ఆంధ్ర- ఒడిశా సరిహద్దులో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం సృష్టించింది.ఈ మేరకు శ్రీకాకుళం జిల్లాలోని గొప్పిలి – గారబంద మధ్యలో స్థానికులకు పెద్దపులి కనిపించింది.
ఈ క్రమంలో అటవీశాఖ సిబ్బంది ఏర్పాటు చేసిన కెమెరాలకు పెద్దపులి సంచరిస్తున్న దృశ్యాలు చిక్కాయి.గండహతి జలపాతానికి వెళ్లే సందర్శకులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
మరోవైపు పులి సంచారం నేపథ్యంలో సమీప ప్రాంత వాసులు సైతం తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు.