సిద్దిపేట జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది.దుబ్బాకలోని మల్లాయిపల్లిలో పులి కనిపించిందని స్థానికులు తెలిపారు.
ఈ క్రమంలోనే లేగ దూడపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.దీంతో స్థానిక ప్రజలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు.
అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు పులి పాదముద్రలను గుర్తించే పనిలో పడ్డారు.పులి సంచారం నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.