సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి నియోజకవర్గాన్ని ప్రకృతి పగ పట్టిందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.నియోజకవర్గ పరిధిలో వరుసగా రెండు రోజులు పిడుగులు పడి,ఇద్దరు మృతి చెందడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
మంగళవారం సాయంత్రం నాగారం మండల కేంద్రంలో పత్తి చేలో పిడుగు పడి కాట్రేగుల గంగమ్మ(55)మృతి చెందగా, బుధవారం సాయంత్రం తుంగతుర్తిలోని ఎస్టీ గురుకుల పాఠశాల వెనకాల పిడుగు పడి మేకలకాపరి వీరబోయిన నాగయ్య(40)తండ్రి భిక్షం మరియు మూడు మేకలు కూడా మృత్యువాత పడ్డాయి.మృతుడికి భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు.
వరుస పిడుగులు,వరుస మరణాలతో తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు వర్షం వస్తే చాలు భయంతో వణికిపోతున్నారు.పిడుగుపాటుకు మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.