పక్కా కమర్షియల్ లో ముగ్గురు హీరోయిన్స్..!

మారుతి డైరక్షన్ లో గోపీచంద్ హీరోగా వస్తున్న సినిమా పక్కా కమర్షియల్ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమాలో రాశి ఖన్నా కాకుండా మరో ముగ్గురు హీరోయిన్స్ నటించారని తెలుస్తుంది.

రాశి ఖన్నాతో పాటుగా కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఈ సినిమాలో నటించిందని తెలుస్తుంది.ఆమెతో పాటుగా చిత్ర శుక్లా, అదితి గౌతం అలియాస్ శీయ కూడా ఈ సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది.

రాశి ఖన్నాతో పాటుగా ఈ ముగ్గురు హీరోయిన్స్ కూడా పక్కా కమర్షియల్ సినిమాలో ఎంటర్టైన్ చేయనున్నారు.పక్కా కమర్షియల్ సినిమా ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచారు డైరక్టర్ మారుతి.

గోపీచంద్ మార్క్ మాస్ అంశాలతో మారుతి మార్క్ మూవీగా ఈ సినిమా వస్తుంది.సీటీమార్ సినిమాతో నిరాశపరచిన గోపీచంద్ పక్కా కమర్షియల్ సినిమాతో కమర్షియల్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

Advertisement

సినిమా మీద గోపీచంద్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత గోపీచంద్ రెండు సినిమాలు లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది.

పక్కా కమర్షియల్ అనుకున్న విధంగా హిట్ అయితే మళ్లీ మారుతి డైరక్షన్ లో సినిమా ప్లాన్ చేస్తున్నారట గోపీచంద్.

Advertisement

తాజా వార్తలు