ముగ్గురు బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్స్‌ కు కరోనా, లేట్‌ అయ్యే ఛాన్స్‌

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 4 కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కరోనా కారణంగా రిస్క్‌ తీసుకోవద్దనే ఉద్దేశ్యంతో కంటెస్టెంట్స్‌ అందరిని కూడా పార్క్‌ హయత్‌ హోటల్‌ లో రెండు వారాల పాటు ఐసోలేషన్‌ ఉంచాలని భావించారు.

అక్కడ నుండి నేరుగా బిగ్‌ బాస్‌ హౌస్‌ లోనికి పంపించాలని ప్లాన్‌.ఇప్పటికే హౌస్‌ మెంట్స్‌ ఐసోలేషన్‌ ప్రారంభం అయ్యింది.

ఐసోలేషన్‌ ఆరంభం రోజే అందరికి కరోనా పరీక్షలు నిర్వహించారు.అందరికి కూడా నెగటివ్‌ వచ్చింది.

దాంతో ఐసోలేషన్‌ చేసి పది రోజుల్లో వారిని బిగ్‌బాస్‌ ఇంటికి తీసుకు వెళ్లాలనుకున్నారు.అయితే మొత్తం ప్లాన్‌ రివర్స్‌ అయ్యింది.

Advertisement

ఈనెల 30వ తారీకు నుండి షో ను ప్రారంభించలనుకున్న వారికి పాజిటివ్‌ షాక్‌ ఇచ్చింది.పరీక్షల్లో నెగటివ్‌ వచ్చినా కూడా వైరస్‌ ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ లో నెగటివ్‌ వస్తుంది.

ఆ తర్వాత రెండు మూడు రోజులు లేదా వారం రోజుల లోపు పాజిటివ్‌ వచ్చే అవకాశం ఉంటుంది.అందుకే కరోనా పరీక్షలు ఇంటి సభ్యులందరికి కూడా చేయడం జరిగింది.

ఈసారి ఏకంగా ముగ్గురికి కరోనా వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.

కరోనా తో ప్రస్తుతం వారు పార్క్‌ హయత్‌ లోనే ట్రీట్‌ మెంట్‌ పొందుతున్నారు.ఈ విషయాన్ని స్టార్‌ మా వారు నిర్థారించడం లేదు.అయితే సినీ వర్గాల్లో మాత్రం ఈ విషయమై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
సూర్య తో మల్టీ స్టారర్ సినిమా చేయనున్న మరో స్టార్ హీరో...

ముగ్గురికి కరోనా పాజిటివ్‌ అంటూ నిర్ధారణ అయిన కారణంగా షోను అనుకున్న రోజు కంటే వారం ఆలస్యంగా ప్రారంభించే అవకాశం ఉందంటున్నారు.కరోనా కారణంగా సెప్టెంబర్‌ 6కు ఈ షో వాయిదా వేశారు.

Advertisement

తాజా వార్తలు