టెట్, కాకుండా,తమ కోసం ప్రత్యేకంగా నిర్వహించాలని ఉపాధ్యాయులు( Teachers ) కోరుతున్నారు.దీని కోసం పలు ఉపాధ్యా య సంఘాల నేతలు ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించారు.
రాష్ట్రంలో పెద్దఎత్తున ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.ఈ డీఎస్సీ పరీక్ష( DSC Exam )కు ముందే టెట్ నిర్వహించాలని నిర్ణయించి, షెడ్యూల్ ప్రకటించింది.
దాని ప్రకారం అభ్యర్థులు ఈ నెల 27 నుంచి వచ్చే నెల 10 వరకు ఆన్ లైన్లో దరఖాస్తులు సమ ర్పించాలి.టెట్ను కంప్యూ టర్ బేస్డ్ టెస్ట్ సీబీటీ,పద్ధతిలో మే 20 నుంచి జూన్ 3 వరకు నిర్వహించనున్నారు.
ఫలితాలను 20లోపు ప్రకటించనున్నారు.ఈ టెట్ పూర్తిస్థాయి నోటిఫికేషన్ను ఈ నెల 20న జారీ చేయాల్సి ఉంది.కానీ,కొన్ని సాంకే తిక కారణాల వల్ల నిలిచిపోయింది.ఒకటి రెండు రోజుల్లో విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు.అయితే ఈ టెట్పై ఉపాధ్యాయులు కొంత అసంతృప్తితో ఉన్నారు.2010 తర్వాత ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు కచ్చితంగా టెట్ పాసై ఉండాలనే నిబంధన తీసుకొచ్చిన విషయం తెలిసిందే.టెట్ సర్టిఫికెట్ ఉంటేనే వారికి పదోన్నతులు కల్పించనున్నారు.రాష్ట్రంలో చాలామంది ఉపాధ్యాయులకు టెట్ సర్టిఫికెట్( Tet Certificate ) లేదు.దాంతో వారికి పదోన్నతులు నిలిపి వేశారు.ఇలాంటి ఉపాధ్యాయులు ప్రస్తుతం ప్రకటించిన టెట్ రాసి, ఉత్తీర్ణులు కావాలని ప్రభుత్వం సూచిస్తోంది.
అయితే ఈ టెట్లో తాము ఉత్తీర్ణత సాధించలేమని,తమ కోసం ప్రత్యేక టెట్ నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.దీనికి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేన్, ఎన్సీటీఈ నిబంధనలు అంగీకరించవని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఆసక్తిగా మారింది.