టాలీవుడ్ బ్యూటీ నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సంపాదించుకుంది రష్మీక.
అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి క్రేజ్ వున్న హీరోయిన్ గా రాణిస్తోంది రష్మిక మందన్న.ఇకపోతే రష్మిక ఈ మధ్య కాలంలో ఎలాంటి సినిమాలు చేసినా కూడా ఆ సినిమా బాక్సాఫీసు వద్ద భారీగా కలెక్షన్లు రాబట్టడంతో ఈ ముద్దుగుమ్మకు భారీగా డిమాండ్ ఏర్పడింది.
చూస్తుంటే భవిష్యత్తులో బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పే అవకాశం ఉన్నట్లు వార్తలి వినిపిస్తున్నాయి.కానీ రష్మిక మందన్న మాత్రం బాలీవుడ్ కి వెళ్ళినా కూడా సౌత్ సినిమాలను మాత్రం వదిలేలా లేదు అన్నట్లు తెలుస్తోంది.
ఇక ప్రస్తుతం సౌత్ సినిమాలకు బాలీవుడ్ లో భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తున్న విషయం తెలిసిందే.అయితే సౌత్ సినిమాలకు బాలీవుడ్ ప్రేక్షకులు ఎందుకు అంత అట్రాక్ట్ అవుతున్నారు అన్న విషయంపై కూడా ఈ ముద్దుగుమ్మకి ఒక క్లారిటీ కూడా ఉంది.
తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న రష్మిక మందన్న సౌత్ సినిమాలకు బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో క్రేజ్ రావడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని వెల్లడించింది.ఈ మధ్య కాలంలో విడుదల అయిన పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ లాంటి సినిమాలు బాలీవుడ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం విధితమే.
అయితే బాలీవుడ్ ప్రేక్షకులు మన సినిమాలను ఎంతగానో ఇష్టపడుతుండడం వెనుక కంటెంట్ తో పాటు మరొక కారణం కూడా ఉందని తెలిపింది.రీసెంట్ గా నార్త్ సైడ్ షూటింగ్ కి వెళ్లిన రష్మిక ఎందుకు అంతగా సౌత్ సినిమాల్లో ఇష్టపడుతున్నారు అని వారిని అడగగా తాము ఇప్పటి నుంచి సౌత్ సినిమాలను చూడడం లేదు అని ఇంతకుముందు టీవీలలో కూడా చాలా ఇష్టంగా చూసే వాళ్ళం అని ఇప్పుడు థియేటర్లలో ఇంకా బావుందని చెప్పారు.అంతే కాకుండా సంస్కృతి ఆచారాలను కూడా పర్ఫెక్ట్ గా చూపించడంతో అక్కడ జనాలు ఎక్కువగా సౌత్ మూవీస్ కు ఎట్రాక్ట్ అయ్యారు అని చెప్పుకొచ్చింది రష్మిక మందన్న.