టాలీవుడ్ ఇండస్ట్రీలో అందం అభినయంతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకున్న నటి రెజీనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒకానొక సమయంలో ఈమె మీడియం రేంజ్ హీరోలందరి సరసనా నటించి నటిగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
ఈ విధంగా మీడియం రేంజ్ హీరోలతో నటించిన రెజీనాకు స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశం రాలేదనే చెప్పాలి.ఈ విధంగా హిట్ ఫ్లాఫ్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో నటించిన ఈ ముద్దుగుమ్మ గత కొంత కాలం నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరమైంది.
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ ప్రధానపాత్రలో నటించిన ఆచార్య సినిమాలో ప్రత్యేక పాట ద్వారా ప్రేక్షకులను సందడి చేయనుంది.ఈ సినిమాలో ‘సానా కష్టం వచ్చిందే మందాకినీ‘అంటూ సాగిపోయే ఈ పాటలో రెజీనా మెగాస్టార్ చిరంజీవితో కలిసి డాన్స్ చేశారు.
ఈ పాట ఇప్పటికే మంచి ఆదరణ దక్కించుకుంది.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రెజీనా ఈ ప్రత్యేక పాటల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేజీనా ఇకపై ఇలాంటి ప్రత్యేక పాటల ద్వారా ప్రేక్షకులను సందడి చేయనుందా అనే ప్రశ్న ఎదురవడంతో ఆ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ… ఇకపై తాను ఎలాంటి ప్రత్యేక పాటలలో నటించడం లేదని తెలిపారు.ఈ పాటలో నటించక ముందే తనకు చాలా మంచి అవకాశాలు వచ్చాయని అయితే తనకి ఇలా ప్రత్యేక పాటలో నటించడం ఇష్టం ఉండదని తెలిపారు.ఇక ఈ సినిమాలో నటించడానికి గల కారణం మెగాస్టార్ చిరంజీవి.ఈ సినిమా చిరంజీవి సినిమా కావడంతో ఆయనతో కలిసి నటించాలనే కోరికతో ఇందులో నటించానని, ఇకపై ఇలాంటి పాటలకు ఒప్పుకోనని ఈమె ఈ సందర్భంగా వెల్లడించారు.