చుండ్రు. స్త్రీలే కాదు పురుషులు కూడా ఈ సమస్యతో తీవ్రంగా మదన పడుతుంటారు.చుండ్రు అనేది చాలా చిన్న సమస్య అయినప్పటికీ.తీవ్రమైన అసౌకర్యానికి గురి చేస్తుంది.పైగా తలలో చుండ్రు ఉందంటే.దురద, ఇరిటేషన్, మొటిమలు, జుట్టు పొడిబారిపోవడం, హెయిర్ ఫాల్ వంటి ఎన్నో సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.
అందుకే చుండ్రు అంటే భయపడుతుంటారు.దాన్ని వదిలించుకోవడం కోసం ఖరీదైన షాంపూలు, ఆయిల్స్ వాడుతుంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ రెమెడీని ట్రై చేస్తే కేవలం ఒక్క నైట్లోనే చుండ్రును పోగొట్టుకోవచ్చు.మరి లేటెందుకు ఆ రెమెడీ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం.ముందుగా గుప్పెడు పుదీనా ఆకులు, గుప్పెడు వేపాకులు, రెండు రెబ్బల కరివేపాకు తీసుకుని ఒక సారి వాటర్లో కడిగాలి.
ఆ తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసి వాటర్ సాయంతో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి జ్యూస్ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ జ్యూస్లో రెండు టేబుల్ స్పూన్ల అలోవెర జెల్, వన్ టేబుల్ స్పూన్ ఆముదం, వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసుకుని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
ఆపై ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి.షవర్ క్యాప్ను ధరించాలి.
నైట్ నిద్రించే ముందు ఇలా చేసి.
ఉదయాన్నే మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.ఇలా చేస్తే ఒక్క దెబ్బతో చుండ్రు సమస్య మాయం అవుతుంది.
అలాగే వారానికి ఒకసారి ఈ రెమెడీని పాటిస్తే చుండ్రు మళ్లీ మళ్లీ రాకుండా కూడా ఉంటుంది.కాబట్టి, ఎవరైతే చుండ్రు సమస్యతో తీవ్రంగా బాధ పడుతున్నారో.
వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న సింపుల్ హోమ్ రెమెడీని ప్రయత్నించండి.ఖచ్చితంగా మంచి ఫలితం మీసొంతం అవుతుంది.