హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్ పేరు పెట్టడం సరికాదని మాజీఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు.యార్లగడ్డ మాటలు మార్చారని వస్తున్న వార్తలను ఖండించిన ఆయన.
ఎన్టీఆర్ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ తన మూడు పదవులకు రాజీనామా చేసినట్టు తెలిపారు.అదేరోజు రాజీనామా పత్రాలు కూడా అధికారులకు అందజేశానన్నారు.
రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదన్న యార్లగడ్డ.భాషాభివృద్ధికి పదవే అవసరం లేదని చెప్పారు.
పదవిలో లేకపోయినా భాషాభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.ఏపీ రాజధానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని ఎప్పుడో చెప్పానన్న ఆయన.అయితే, గత ప్రభుత్వం రాజధానికి అమరావతి పేరు పెట్టిందన్నారు.దేవేంద్రుడు రాజధాని అమరావతి.
ఆ పేరు ఏపీకి ఎందుకు? అని యార్లగడ్డ ప్రశ్నించారు.